వెండితెరపై పవర్ స్టార్ 27 ఏళ్ల జర్నీకి శుభాకాంక్షలు తెలిపిన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, జనసేన అధినేత…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, ప్రజా సేవకుడిగా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ప్రేక్షకాభిమానుల కోరిక మేకరు సినిమాల్లోనూ నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరిడిగా పరిశ్రమకి పరిచయం అయినా కాలక్రమేణా మెగా ఇమేజ్ కి దూరమై..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. నటుడిగా కంటే వ్యక్తిగతంగా మానవతా దృక్ఫథంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్ధాల సినీ కెరీర్ లో నటుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే. కానీ ప్రజల మనసుల్లో శిఖరాగ్రానికి చేరుకున్నారంటే? కేవలం అతనిలో మానవతా దృక్ఫధమే కారాణమనొచ్చు. తాజాగా నేటితో ఆయన సినీ ప్రయాణానికి 27 వసంతాలు పూర్తయింది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారీ ఎత్తున మచిలీ పట్నంలో జరగుతుంది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు సినీ ప్రస్థానం మొదలై నేటికీ 27 సంత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్బంగా గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పది సంత్సరాలు ఎలాంటి విజయాలు లేకపోయినా, చెక్కు చెదరని కోట్లామంది అభిమానులును భక్తులును సంపందించుకున్న గొప్ప పవర్ ఫుల్ పవర్ స్టార్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుండగా తొమ్మిది సంత్సరాలు క్రితం జనసేన పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. సినిమా అనేదే కేవలం తన బ్రతుకుతెరువు కోసం, పార్టీని నడిపించడం కోసం మాత్రమే సినిమాలు తీస్తూ యువత నీ మేధావులు మంచివారుతో వీరమహిళలు జనసైనికులుతో సరికొత్త రాజకీయం చెయ్యడానికి ఓటుకి నోటు అనే పదం లేకుండా లంచం అనే పదం లేకుండా రాజకీయం చెయ్యడానికి ఓ గొప్ప నేతగా ఎదుగుతున్న శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి జీవితంలో ఇక అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని జనసేన జానీ తెలిపారు.