తుని నియోజవర్గంలో జనసేన పార్టీలో చేరిక

  • అంకం రెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో 12 మంది వీర మహిళలు, వారి కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిక

తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం, భీమ వరపు కోట గ్రామంలో గ్రామ జనసేన నాయకులు గంటా దుర్గా ప్రసాద్ సహకారంతో, 12 మంది వీరమహిళలు, వారి కుటుంబాలతో కలిసి, జనసేన పార్టీలో చేరారు. వారికి తుని నియోజకవర్గం జనసేన నాయకులు అంకంరెడ్డి రాజా శేషు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరమహిళలలో కన్నమ్మ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారు నిజాయతీ నచ్చి, ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, మేము అందరం జనసేన పార్టీ తో కలిసి నడుస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో, మండల జనసేన నాయకులు మరియు వైస్ ప్రెసిడెంట్ నక్కా రామ కృష్ణ (రామ్ జనసేన) అల్లు రాజు బాబు, సురేష్, అభిషేక్ జనశైనికులు పాల్గొన్నారు.