మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

గజపతినగరం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో బొండపల్లి మండలం కో-కన్వీనర్ గుద్ధులు పైడిరాజు (జానీ) కొత్తపాలెం పంచాయతీ, జీడిపాలెం గ్రామం మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం, వైయస్సార్సీపి వార్డు మెంబర్లు దాట్ల పైడమ్మ, రాంబాబు శంకర్ గౌరీష్ లక్ష్మి, సింహాచలం దిలీప్ ఆదిలక్ష్మి రాంబాబు శంకర్ గౌరీ లక్ష్మి అప్పన్న బాబు, గ్రామానికి చెందిన 30 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ అవినీతి, ఆరాచకం పోవాలి, అభివృద్ధి, సంక్షేమం రావాలి అని నినదిస్తూ, గ్రామంలో వైసీపీకి షాక్ ఇచ్చిన నాయకులు, ఎన్నికలకు ముందే చేతులెత్తేసే పరిస్థితుల్లో వైయస్సార్సీపి, సమిష్టిగా భారీ విజయం వైపు దూసుకెళుతున్న జనసేన-టిడిపి శ్రేణులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగడం ఖాయమని వారందరికీ జనసేన కండువా వేస్తూ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మిడతాన, బొండపల్లి మండల కో-కన్వీనర్ కోసురు అప్పన దొర, పైడే రాజు, బాలాజీ, భాను, అశోక్, అనిల్, మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.