కాకినాడ జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: గొడరిగుంటలో సోమవారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో వలసపాకల జనసేన నాయకులు పండు నాయుడు నాయకత్వంలో సర్పవరం, వాకలపూడి, వలసపాకల గ్రామాలకి చెందిన సుమారు 25 మంది పెద్దలు జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు చాగంటి కుమారస్వామి, మల్లిపూడి రామక్రిష్ణ, చాగంటి శ్రీనివాస్, బొంతరెడ్డి సురేష్ దుంగా అర్జున్, గోపాలకృష్ణ. సి హెచ్ నావ సత్యనారాయణ, యడ్లపల్లి కృష్ణ, జాజ్జురి ప్రసాద్, పాటి సురేష్, ఎన్ రమేష్, నల్ల శ్రీనివాస్, జె చిన్నారి
సత్యసాయి, పి వెంకట్ తదితరులు ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సిద్ధాంతాలు నచ్చి, సమస్యలపై స్పందించే విధానాలకి ఆకర్షితులై పెద్దలు జనసేన పార్టీలో చేరుతున్నారని పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోదే ముసలయ్య, తూము బన్ను, సంగడి శ్రీను, శాండీ తదితరులు పాల్గొన్నారు.