బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరికలు

నర్సాపురం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పెదపల్లవ పాలెంకు చెందిన అగ్నికుల క్షత్రియ సోదరులు వాటాల కృష్ణమూర్తి, వాటాల సుబ్బారావు, వాటాల సోమరాజు, వాతాడి వెంకటేశ్వర్లు, పెదవింగి గీగులుదాసు, కొల్లాటి శ్రీను, చింతా పెద్దిరాజు, పొన్నమండ మధు, అద్దంకి ప్రసాద్, కర్రి నాగేంద్ర, మోకా లక్ష్మణస్వామి, కొల్లాటి మోహనకృష్ణ, కొల్లాటి కృష్ణమోహన్, పొన్నమండ వడ్డికాసులు, అండ్రాజు శ్రీనుబాబు, కొల్లాటి సూర్య చంద్రరావు, మోకా రవికృష్ణ, వాతాడి వాసు, కొల్లాటి దుర్గరాజు, పెమ్మాడి రవి, కొల్లాటి శ్రీను, కొప్పాడి ఉత్తిరాజు, పొనుపోతు చంద్రశేఖర్ లు అలాగే దాదాపుగా 200 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి మొగల్తూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొల్లాటి గోపీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ రోజు రోజుకి జనసేన పార్టీ బలం పెరుగుతుంది అనడానికి మీలాంటి వాళ్ళ ఆదరణ అని అన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి జనసేన పార్టీ గులుపుకి కృషి చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.