పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేనలోకి చేరిక
పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాద్యుడు సిజి రాజశేఖర్ అధ్యర్యంలో పార్టీ ఆఫీస్ యందు క్రిష్ణగిరి మండలము ఆగవేలి గ్రామ వైస్సార్సీపీ నాయకులు బోయ రామలింగి బాలు, బోయ కుమార్ నాయుడు, బోయ మహేంద్ర, బోయ కృష్ణ. టి. మునుస్వామి, బి.రంగడు, బి. మహేష్ మరియు ఆ గ్రామ వైస్సార్సీపీ నాయకులు, క్రిష్ణగిరి జనసేన పార్టీ మండలం నాయకులు బోయపులి శేఖర్ అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు. ఆగవెల్లి గ్రామములో ఎటువంటి అభివృద్ధి పనులు గ్రామంలో జరగలేదు, వైయస్ఆర్సిపి పార్టీలో మేమంతా ఎంతో కష్టపడి ఎమ్మెల్యేని సర్పంచ్ని గెలిపించుకున్నా, ఎవరికి కూడా న్యాయం జరగలేదు, అందుకే వైస్సార్సీపీ మాకు వద్దు జనసేన ముద్దు అని, అందరికీ న్యాయం జరగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యం న్యాయం జరుగుతుందని దాదాపుగా 10 కుటుంబములు జనసేనలో చేరడం జరిగినది. పత్తికొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈరోజు నుండి మీకు, మీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటామని, మీరు ఎవరు కూడా భయపడకుండా పార్టీని ఇంకా బలపేతం చేయాలని మీకు న్యాయం జరిగే విధంగా మీ అంటే మేము ఉంటామని, అధ్యక్షులు నిర్ణయానికి కట్టుబడి మనం పని చేయాలని, మరో మూడు నెలల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం, ఎలక్షన్ కోసం ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని, ప్రజలు వైసిపికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు, గ్రామాలలో అభివృద్ధి నోచుకోలేదు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-4.24.34-PM-1024x461.jpeg)