పాణ్యం నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

ఉమ్మడి కర్నూల్ జిల్లా, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండల పరిధిలో గల బస్తిపాడు గ్రామం నుంచి అంజి ఆధ్వర్యంలో వెంకటేష్, శ్రీనివాసులు, రఘు, శ్రీను, శివ, మహేశ్, రామంజి, పెద్దయ్య మరియు వారి మిత్ర బృందం జనసేన పార్టీలో దాదాపు 60 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ లో చేరడానికి వచ్చిన యువతను జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి చింతా సురేష్ బాబు జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తుందని, అందుకుగాను మనమందరం కలిసి పార్టీ కోసం పని చేసి, జనసేన పార్టీ గెలుపే ద్యేయంగా ముందుకెళదాం అని అన్నారు. ఈ కార్యక్రంలో జనసేన పార్టీ నాయకులు వై.బజారి, బోయ సుధాకర్, రాంబాబు, కృష్ణబాబు, హుస్సేన్, శివ, భాస్కర్, సతీష్ పాల్గొన్నారు.