పంతం నానాజీ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్ రమణయ్య పేట గ్రామ పంచాయితీ వైసీపీ పార్టీ 14వ వార్డు మెంబర్ చంటి రెడ్డి వారి ముఖ్య అనుచరులతో ఆ పార్టీకి రాజీనామాలు చేసి సుమారు 100 మంది పెద్దలు, యువకులు, మహిళలు గురువారం గంగరాజు నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో జనసేనలో చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.