కదిరి నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

కదిరి నియోజకవర్గం: ఎన్. పి కుంట మండలం, దనియాని చెరువు పంచాయితీ నుంచి కదిరి నియోజక వర్గ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో మనడల నాయకులు మేకల చెరువు సమక్షంలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల కోసం, ప్రజా క్షేమం కోసం చేస్తున్న కృషిని చూసి ఆయనకు మద్దతుగా గురువారం పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరిని భైరవ ప్రసాద్ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు మేకల చెరువు చౌదరి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటి వింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్ర ప్రసాద్, రవి, గోపీనాథ్, బక్కసం నవీన్ పాల్గొన్నారు.