బొలిశెట్టి సమక్షంలో జనసేనలో చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామం నుండి మండల అధ్యక్షులు పుల్లా బాబి ఆధ్వర్యంలో చెన్న రాంబాబు సహకారంతో రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఎస్సి కులాల నుండి సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరు బలంగా కృషి చేయాలని కోరడం జరిగింది. పార్టీలో మహాసేన నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్, డి.వాసు, పి.దావీద్ రాజుతో పాటు తదితరులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి యాంట్రపాటి రాజు, ఉభయగోదావరి జిల్లాల మహిళా కో-ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, గరగ హరీష్, మానె గణేష్, లింగపల్లి శేషు, ఉడిముడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.