పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామం 9వ వార్డు గోపి కృష్ణ కాలనీ నుండి తీరుమాని కుమార స్వామి నాయకత్వంలో తూరంగి గ్రామ అధ్యక్షులు, పితాని శివ తేజ, రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది, యువకులు కాకినాడ గోడారిగుంటలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీ సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వీరబాబు, కాళ్ళ గోపి, శాండీ తదితరులు పాల్గొన్నారు.