యాతపేట గ్రామంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల, నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చూసి ఈ నీచపు ప్రభుత్వంపై విసుగు చెంది, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి నిత్యం ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం గుంపామ్ పంచాయతీలో యాతపేట గ్రామంలో సుమారు 60 కుటుంబాల నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగా మండల సీనియర్ నాయకులు గుడివాడ జమ్మరాజు, గుడివాడ శేఖర్, బోనాల నర్సింగరావు, పైడి రాజు, అల్తి అప్పలనాయుడు, సువ్వడ రవి మరియు గ్రామ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.