బలిజిపేట మండలంలో జనసేన పార్టీలో చేరికలు

పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం, సుభద్ర గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా కర్రి అచ్యుత రావు, బోను హరి కృష్ణ, గుంప క్రిష్ణ తదితర 30 కుటుంబాలు వైసిపి పార్టీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు గంగాడ గ్రామానికి చెందిన మాజీ వైస్ సర్పంచ్ దివంగత నేత దత్తి శివరావు సతీమణి దత్తి లక్ష్మి గారిని బాబు పాలూరు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు గంట్యేడ స్వామి నాయుడు, పైల ప్రసాద రావు, మామిడి సత్యనారాయణ, పకీరు నాయుడు, జనార్థన్, కళ్యాణ్ మరియు సుభద్ర గ్రామం తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *