Kothavalasa: జనసేనకు పెరుగుతున్న ఆదరణ
జనసేనకు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి ఆదరణ గణనీయంగా పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, కొత్తవలసలో పార్టీ నాయకుడు పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు ఆదివారం జనసేనపార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీరామ కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శివశంకర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఇతర పార్టీల నాయకులు బానిసత్వంలో మునిగిపోయారన్నారు. సమాజం మీద బాధ్యత, అభివృద్ధి మీద శ్రద్ధతో బానిసత్వాన్ని వీడి బయటికి రావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే వారసత్వ, నిరంకుశ నాయకత్వానికి చ్రమగీతం పాడాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ వ్యవస్థలు బ్రష్టు పట్టి, అభివృద్ధి పాతాళానికి పడిపోయిన ఈతరుణంలో పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరం ఉందన్నారు. జనసైనికులు అంకుఠిత దీక్షతో ముందుకుసాగాలన్నారు. పార్టీ నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్తిబాబు, గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు, వబ్బిన సన్యాసినాయుడు పార్టీ బలోపేతం కోసం జనసైనికులు ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాజన్న కాలనీ, చీపురువలస, గొల్లపేట, దత్తి, తుమ్మికాపల్లి, కొత్తవలస రాజీవ్ నగర్ కాలనీ, ఎస్సీ కాలనీ, కాంప్లెక్స్, చింతలదిమ్మ, పాత సుంకరపాలెం, ఎర్రవానిపాలెం ప్రాంతాల నుంచి పలువురు కార్యకర్తలు జనసేనపార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆదాడ మోహన్, పార్లమెంటరీ కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, నాయకులు నక్కరాజు సతీష్, వబ్బిన సతీష్, తూరిబిల్లి విజయ్ కుమార్, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, బోని రామ గణేష్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-07-at-2.07.12-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-07-at-2.07.10-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-07-at-2.18.59-PM-1024x460.jpeg)