‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమం నాటి కథనాలు పోస్టు చేసిన పవన్ కళ్యాణ్ ..

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన అమర వీరుల పట్టిక’ అంటూ వారి వివ‌రాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. అలాగే, ఆ ఉద్యమంలో  గాయపడ్డ వారి పేర్ల‌ను కూడా ప‌వ‌న్ కళ్యాణ్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ అప్ప‌ట్లో ప‌లు వార్త ప‌త్రిక‌లు ప్ర‌చురించిన క‌థ‌నాల‌ను ప‌వ‌న్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

పోలీసుల కాల్పులు, మృతులు, గాయ‌ప‌డ్డ వారి వివ‌రాల‌ను వాటిల్లో వివ‌రించారు. అలాగే, అప్ప‌టి ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లను కూడా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించే ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ప్ర‌స్తుతం ప‌లువురు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు తెలిపారు.