ఆమదాలవలస జనసేనలో చేరికలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-6.07.28-PM-1024x727.jpeg)
పొందూరు మండల పరిధిలోని నందివాడ పంచాయతీకి చెందిన 25 మంది యువకులు ఆమదాలవలసలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో పిసిని సతీష్, పిసిని అప్పలనాయుడు, పొగిరి ప్రవీణ్, పిసిని షణ్ముఖ సాయి, ముల్లు శ్రీను, గేదెల తిరుమలరావు, కోండ్రు సురేష్, మజ్జి కార్తీక్, మజ్జి మదు, మజ్జి సీతన్నాయుడు, మజ్జి సాయి, మజ్జి మహేంద్ర, ఇప్పలి రమేష్, బొడ్డాడ రాజశేఖర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరినట్లు వెళ్లడించారు. ఈ కార్యక్రమంలో రాపాక జనసేన నాయకులు రమణ, రెడ్డి పేట జనసేన నాయకులు సంతోష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-6.07.27-PM.jpeg)