యాదమరి మండల జనసేన ఆధ్వర్యంలో మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం

జనసేన పార్టీ యాదమరి మండల అద్యక్షులు కుమార్ ఆద్వర్యంలో ఆదివారం మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచెయ్యాలని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మండలంలో జనసేన పార్టీ కోసం కష్టపడ్డవారిని గుర్తించి వారికి తగిన స్థానం కల్పిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల చందు, రవి, యువరాజ్, హరి మరియు జనసైనికులు పాల్గొన్నారు.