కొవెలపాలెం గ్రామంలో జనసేన, బిజెపి, టీడీపీల ఉమ్మడి ప్రచారం
అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, అడ్డతీగల మండలం, భీమవరం పంచాయతీ, కొవెలపాలెం గ్రామంలో మంగళవారం అభివృద్ధి జరగాలంటే జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు గెలిపించండి వివరించడం జరిగింది. అరకు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజవర్గం ఎం ఎల్ ఏ అభ్యర్థి శ్రీమతి మిరియాల శిరీష దేవి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చెదల అంజి తెలుగుదేశం ఎక్స్ ఎం.పి.టి.సి ముర్ల నూకరత్నం మరియు తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-4.42.35-PM.jpeg)