ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యవర్గ సమావేశం

చిలకలూరిపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు 6వ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమల్ హాజరైయ్యారు. ఈ జిల్లా కార్యవర్గం మండల కమిటీ, అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అందులో వారాహి విజయ యాత్ర, గ్రామ కమిటీలు & బూత్ స్థాయి కమిటీలు, ఆర్టీఐ ద్వారా మండల కార్యాలయం నుండి ఓటరు జాబితా, బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) వద్ద ప్రతి నెల మొదటి వారం ఓటరు జాబితా తనిఖీ ఫోన్ నంబర్లతో మండల కమిటీ జాబితా, నెలవారీ మండల కమిటీ సమావేశాలు మినిట్స్ జిల్లా కార్యాలయానికి పంపాలని, ఆధారాలతో స్థానిక సమస్యల ఫైళ్లను సిద్ధం చేయాలని, ఫోర్జరీ (కల్తీ) విత్తనాలు, యూరియా డీఏపీ లభ్యత నుండి రక్షణ గురించి మండల వ్యవసాయ అధికారి అర్బీకేలకు అభ్యర్థన లేఖ సమర్పించాలని, ప్రోటోకాల్ విదిగా పాటించాలని, గ్రామ కేంద్రాలలో ప్రజలకు అవగాహన కల్పించండి మరియు టీ దుకాణాలు, సాయంత్రం సమావేశాలు వంటి గ్రామ స్థాయి చర్చలలో పాల్గొన్నాలని, యువతకు ఉపాధి కోసం 5 మంది సభ్యుల బృందానికి 10 లక్షలు, కుటుంబానికి 25 లక్షలకు ఆరోగ్య బీమా ఇస్తూ జనసేన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లడం, మెంబర్‌షిప్ కిట్‌ల పంపిణీ & ప్రధాన కార్యాలయానికి క్లెయిమ్ చేసే బీమా, జెండా దిమ్మెల జెండాల పునరుద్ధరణ, కొత్త జెండాల నిర్మాణ, ఎల్లప్పుడూ జెండా దిమ్మె వద్ద మంచి జెండా ఉంచాలని, స్థానిక పోలీస్ స్టేషన్లు, మండల కార్యాలయాలలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలని, ఓటరు జాబితాకు సంబంధించి నిర్వహించబోయే ఎమ్మార్వో కార్యాలయంలో సమావేశాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ లో ఉండే నాయకులు రాడ్ల శీను, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బాధినేడు సుబ్బారావు, రాజుపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్ అంచులు అనూష్ కుమార్, రాజుపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటస్వామి, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.