జనసేనానిని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మర్యాద పూర్వకంగా కలిసిన జ్యోతుల
మంగళగిరి నియోజకవర్గం: జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరికి పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు కలిసి వెళ్ళిన జనసేననాయకులు జ్యోతుల శ్రీనివాసు జనసేన అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ ను కలిసి పూవ్వులబొకె అందించారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు పిఠాపురం నియోజకవర్గం నందు జ్యోతుల శ్రీనివాసు తమ సాయిప్రియ సేవాసమితి, జనసేన పార్టీ పేరున చేసే సామజికసేవ కార్యక్రమాలను జనసేన అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. అనంతరం జనసేన అధ్యక్షులు కొణెదెల పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు సమక్షంలో ఫొటోలను తీయంచుకొవడం జరిగినది. అనంతరం జ్యోతుల శ్రీనివాసు తమ స్వగ్రామమైన దుర్గాడ గ్రామానికి చేరుకోవడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-15-at-7.00.26-PM.jpeg)