శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: ఉప్పాడకొత్తపల్లి మండలం, నాగులపల్లి గ్రామంలోని పాటిమీద వీధిలో గల శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవమునకు ఆదివారం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు హాజరయ్యారు. ముందుగా జ్యోతుల శ్రీనివాసును ఆలయకమిటీ వారు ఆలయమర్యాదలతో హోమగుండ దర్శనం చేయించారు. అనంతరం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహప్రతిష్టా కార్యక్రమాల్లో జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ కమిటీ వారు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూనిశెట్టి నీలిరెడ్డి, శ్రీ లక్ష్మీదేవి ఆలయ కమిటి సభ్యులు రమ విశ్వేశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఏ రాంబాబు, చల్లారెడ్డి, వి పవన్ కళ్యాణ్, ఆనంద్ రెడ్డి, దండాల్ రెడ్డి, వి రామకృష్ణ, జ్యోతుల సీతారాంబాబు, మేడిపోయిన హరికృష్ణ, విప్పర్తి శ్రీను, జ్యోతుల శివ తదితరులున్నారు.