విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను అందజేసిన జ్యోతుల

  • ప్రపంచవికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని
  • విభిన్న ప్రతిభావంతులకు బహుమతులను అందజేసిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం: ప్రపంచవికలాంగుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గల విభిన్నప్రతిభావంతులు (వికలాంగు) లందరికీ కూడా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఒక దుప్పటి, ఒక స్వీట్ బాక్స్ ను అందజేశారు. కొడవలి గ్రామం గల రామాలయం నందు విభిన్న ప్రతిభావంతులు(వికలాంగు) లందరికి సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రతిభావంతుల(వికలాంగు) వారందరినీ కూడా అభినందించి వారికి జ్యోతుల శ్రీనివాసు దుప్పట్లను, స్వీట్ బాక్స్లను అందజేశారు. అనంతరం జరిగిన సభలో జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైనటువంటి (వికలాంగులు) ఎంతో ప్రతిభవంతులని వీరి పట్ల సమాజం చిన్నచూపు చూడకూడదని, వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రాయితీని కల్పించి వారిని నేటి సమాజంలో తోటి ప్రజలు గుర్తింపు కల్పించాలని, వికలాంగులు ఏ ఒక్కరు కూడా అవమానపరచడం గాని కించపరచడం గాని చేయకూడదని వారిని ప్రోత్సహించి అన్ని రంగాల్లోని ముందుండేటట్లు రాజకీయంగా, సామాజికంగా అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా జ్యోతులు శ్రీనివాసు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొడవలి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు రెడ్నం సూరిబాబు, మద్దాల‌ రామకృష్ణ, మల్లిపాము కోటేశ్వరరావు, మల్లిపాము కొటి, మద్దాల శ్రీను, తూము దోరబాబు, తుంగపల్లి కృష్ణ, చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు అల్లం దోరబాబు, దిబ్బడి సురేష్, చేదూలూరి త్రిమూర్తులు, ఉలిశెట్టి సుబ్బారావు ఓరుగంటి వినయ్, దుర్గాడ గ్రామ జనసేన నాయకులు పోలం త్రిమూర్తులు, మంతెన గణేష్, చేశెట్టి భద్రం, జీలకర భాను, కోలా నాని, మేడిబోయిన హరికృష్ణ, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.