జనసైనికుల కుటుంబానికి సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికులు బొంతు గంగబాబు, బొంతునాగేశ్వరరావు ల తల్లి బొంతు సత్యవతి అనారోగ్యం కారణంగా మరణించారు. చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు ద్వారా బొంతు సత్యవతి మరణం గురించి తెలుసుకున్న జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు వారి ఇంటికి వెళ్లి బొంతు గంగబాబు, బొంతు నాగేశ్వరరావులను పరామర్శ చేసి వారి తల్లి బొంతు సత్యవతి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు 50 కేజీల బియ్యాన్ని వారికి సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో అల్లం దొరబాబు, దమ్ము చిన్నా, గంటా గోపి, జ్యోతుల సీతారాంబాబు, ఉలిశెట్టి సుబ్బారావు, గంటా గంగబాబు పెంకే శ్రీను, గంట రాము, కొప్పిశెట్టి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.