నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఆర్.డి.టి. రూములకు ఎదురుగా ఉన్న కె.ఎస్.ఆర్ సినిమా హాలు నందు గల స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజులలో జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దీనికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులూ వచ్చినా తాను ముందుండి కాపాడుకుంటానని, ప్రజా పరిపాలనే ధ్యేయంగా అవినీతి లేని రాజ్యమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసేవరకు జనసైనికులు అందరూ పార్టీ కోసం తమ వంతు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పట్టణ నాయకులు, మండల నాయకులు, ఐటీ టీమ్ సభ్యులు మరియు జనసైనికులు పాల్గోన్నారు.