వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని తాడిపత్రి పట్టణంలోని స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహచారి, నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్ పూజలు నిర్వహించారు. వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయడమే లక్ష్యంగా ప్రజా పరిపాలన స్థాపనే ధ్యేయంగా పవణ్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతం కావాలని, అదేవిధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యాత్ర జరిగే ప్రతి నియోజకవర్గంలో జనసైనికులు అందరూ అండగా నిలవాలని వారాహి యాత్రలో ప్రతి జనసైనికుడు భాగం కావాలని అధ్యక్షుల వారికి అండగ నిలిచి ప్రభుత్వాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేసుకుని ముందుకి సాగాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్ అయుబ్, గోపాల్, ప్రథాన కార్యదర్శి సయ్యద్ రసూల్, మణికంఠ, రమణ, అలీ, శివ, అల్తాఫ్, ఇమామ్ వలి, రబ్బానీ, శ్రీనాథ్, రాజు తదితరలు పాల్గొన్నారు.