ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం జనసేన ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేన వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, పిఎసి మెంబర్ అర్హంఖాన్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్, వీర మహిళలు ఎం.కావ్య, శిరీష, రత్న పిల్ల, లిఖిత, సునీత ప్రసాద్, స్వాతి రెడ్డి, సుజాత, ప్రభావతి, జయ కళ్యాణి, వెంకటలక్ష్మి, ముంతాజ్, దాక్షాయిని, పద్మజ, వాసవి, శ్రావణి, అనుష, పుష్పలత వీర మహిళలు పాల్గొన్నారు.