కీర్తి సురేష్ తో పాటు కళ్యాణి ప్రియదర్శన్!

గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త చిత్రం ‘అలమేలుమంగ వెంకటరమణ’. ఈ చిత్రంను రాబోయే రెండు మూడు నెలల్లో సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను సంప్రదించారట. కథ నచ్చడంతో కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు మరో హీరోయిన్ పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ను కూడా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ కు జోడీగా వీరిద్దరు కనిపించబోతున్నారు. హలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ కు తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. తమిళంలో రాణిస్తున్న ఈ అమ్మడు ఈ చిత్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి క్లారిటీని తేజ ఇచ్చే అవకావం ఉందని అంచనా.