కామాంధుడిని కఠినంగా శిక్షించాలి

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిమ్మి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయుకులు బుధవారం పరామర్శించారు. బాధితులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయుకులు మాట్లాడుతూ అభం, శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన వాడిని కఠినంగా శిక్షించాలని, దానిని చూసి భవిష్యత్‌లోఎవరూ కూడా ఇటువంటి పాపానికి ఒడిగట్టాలనే ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా చట్టాలను రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం నాయుకులు జనసైనికులు రౌతు గోవిందరావు, గొర్ల మన్మధ రావు, మత్స పుండరీకం, జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్ , హరికృష్ణ గణేష్, వినోద్, అనిల్ సందీప్, వావిలపల్లి నాగభూషణ్, దత్తి గోపాల్, కర్ణేన సాయిపవన్, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.