“జాతర” లా జరిగిన కంబాల కుంట జనసేన “ఆత్మబంధు” యాత్ర.. 18వ రోజు

రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చుతూ, ప్రతి గుండెను తాకుతూ సాగుతున్న ఆత్మబంధు యాత్ర ఆదివారం పెనగలూరు మండలం, కంబాల కుంట గ్రామంలో యర్రంశెట్టి హరి రాయల్, గొబ్బూరు హరి పర్యవేక్షణ లోదిగ్విజయంగా జరిగినది. యువత అధిక సంఖ్యలో కదిలి రాగా.. అడుగడుగునా స్వాగత సత్కారాలతో డప్పు వాయిద్యాలతో, బాణా సంచా మోతలతో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో కమ్మాల కుంట గ్రామం మారు మ్రోగింది. ఇంటింటి ప్రచారం అనంతరం సభ నిర్వహించారు. అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భోజన ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహించారు. సభలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సీనియర్ నాయకులు జోగినేని మణి, గందంశెట్టి దినకర్ బాబులు మాట్లాడి దిశా, నిర్దేశం చేసారు. ప్రత్యేకించి జనసేన పార్టీ, కువైట్ సభ్యులను అభినందిచారు. గ్రామ పెద్దలను కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కరపత్రములతో ప్రచారం సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నల్లంశెట్టి యానాదయ్య, జోగినేని మణి గంధంశెట్టీ దినకర్ బాబు, మాదాసు నరసింహ, పగడాల మణి ప్రసాద్, కారపు ప్రకాష్, బీదమ్ నవీన్ కుమార్, సవరం సాయినాథ్, మాదాసు శివ, తిమ్మాయపాలెం చిరంజీవి, స్థానికనాయకులు, గంటా రమేష్ రాయల్, గొబ్బూరి హరి, ఏనుగుల శివ, చంద్రగిరి రమణ, వెంకటేష్, మొలకల సాయి, అబ్బిగారి గోపాల్, వినోద్, కళ్యాణ్, తేజ, గుత్తి మోహన, శివ, గోవర్దన్, కునేపల్లి సాయి, హరి, బొడ్డు గంగాధర్, బత్తల వంశీ, తదితరులు పాల్గొన్నారు.