మహాత్మునికి నివాళులర్పించిన కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్, భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టి ప్రపంచానికి అహింస అనేటువంటి ఆయుధాన్ని అందించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కొంతమూరులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలదండ వేసి ఘనమైన నివాళులర్పించినటువంటి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్. అదే సందర్భంగా పూజ్య లాల్ బహుదూర్ శాస్త్రి యొక్క జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించినటువంటి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులదుర్గేష్ మరియు జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు, ఉపాధ్యక్షులు సయ్యద్ సలీం, జనసేన పార్టీ కార్యదర్శి నాగు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మదర్ వలి కాసిం భాష షేక్ వల్లి షేక్ దాదా, సయ్యద్ బాజీ, పెంటు షేక్ సలీం, సయ్యద్ సాజిద్, హుస్సేన్, పెన్నమరెడ్డి రామరాజు, మొండ్రేటి ప్రసాద్, మేకా గణపతి, కర్రి నాయుడు, సునీల్, ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.