మారెమ్మ కుటుంబానికి కందుల నాగరాజు ఆర్థిక సహాయం

వైజాగ్ వెస్ట్: గత పాతికేళ్ళుగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి పరిమితులు విధించుకోలేదని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సేవలందిస్తున్నానని జీవీఎంసీ 32వ కార్పొరేటర్, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు కందుల నాగరాజు తెలిపారు. వార్డుపరిది అల్లిపురం ఎల్లపు వారి వీధికి చెందిన మారెమ్మ అనే వృద్ధురాలు మృతి చెందిన సమాచారంతో కందుల నాగరాజు ఆదివారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవా కార్యక్రమాలను తమ నాయకుడు పవన్ కల్యాణ్ ఎంతగానో ప్రశంసించారని, తమ పార్టీ సిద్ధాంతాలు ప్రజలందరికీ చేరువయ్యేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. త్వరలో పార్టీ అధిష్టానం అనుమతి మేరకు నియోజక వర్గంలో పర్యటించి పవన్ కల్యాణ్ ఆశయాలు, ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతున్న తీరును ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.