గంగారం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర 16వ రోజు
  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, గంగారం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ సోమవారం పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు.. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.. గ్రామంలోని ప్రజలు జనసేన పార్టీకి మద్దుతుగా నిలిచి, వంగ లక్ష్మణ్ గౌడ్ ను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు బొనాసి శివయ్య, సూర్య, మూర్తి నాయక్, రాజు నాయక్, వంశీ రెడ్డి, లింగం నాయక్, పవన్, రామ్ చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.