తాళ్ళవలస జనసేన యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

*టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందించిన కాంతిశ్రీ
*విన్నర్ టీమ్ తాళ్ళవలస
*రన్నర్ టీమ్ రణస్థలం
*బెస్ట్ బౌలర్ అండ్ మాన్ ఆఫ్ ద సీరీస్ గా రాము
*బెస్ట్ బ్యాట్స్మన్ గా రమణ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తి తో.. జిల్లా స్థాయిల్లో లావేరు మండలంలో గల తాళ్ళవలస పంచాయితి జనసేన యూత్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ గా తాళ్ళవలస నిలిచింది. రన్నర్ గా రణస్థలం టీమ్ నిలిచింది. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ విజేత కి ఒక క్రికెట్ కిట్ ను బహుమతిగా అందజేశారు… మరియు రన్నర్స్ గా నిలిచిన రణస్థలం క్రికెట్ టీమ్ కు ₹15000 రూపాయిలు బహుమతిగా అందజేయడం జరిగింది. అలాగే బొంతు నారాయణరావు, మీసాల పెంటం నాయుడు పాటు ఇతర జనసైనుకులతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బర్నాల దుర్గారావు, రాజా రమేష్, సర్పంచ్ అభ్యర్థి నడుపురి శంకర్, కొల రాజేష్, జాన్, సత్యారావు, నీలం నాయుడు, నాయుడు, వెంకీ, పవన్, గౌతమ్ కోటి, లక్ష్మణ్, భాస్కర్, శంకర్ తదితరుల జనసైనుకులు పాల్గొన్నారు.