జనసేనలోకి కాశగూడెం యువత

తెలంగాణ, ధర్మసాగర్, మండలంలోని కాశగూడెం గ్రామ యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి నియోజకవర్గ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేనపార్టీ యువతకు రాజకీయంలో పెద్దపీట వేస్తుందన్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీలు నియోజకవర్గంలో యువతను రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో యువతను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ యువత జనసేనపార్టీ వెంట ఉన్నారని పేర్కొన్నారు. గత పాలకులు అసమర్ధత వల్ల నియోజకవర్గంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో యువతను ఏకం చేసి జనసేన సత్తా చాటుతామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ కాశీం, సయ్యద్ చోట కాశీం, షేక్ కరీమ్, జాఫర్, సయ్యడద్ సర్దార్, అబ్బాస్, సలీమ్, ఉస్మాన్, షేక్ ఉస్సన్ తదితరులు ఉన్నారు.