కావలి, ముసునూరులో కత్తిదాడికి గురైన వారిని పరామర్శించిన అళహరి సుధాకర్

కావలి: ముసునూరులో తాజాగా 5గురి మీద చల్లంచర్ల విజయ్ రెడ్డి చేసిన కత్తిదాడి ఘటనలో సూరిసెట్టి సురేష్ చనిపోగా, మిగిలిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంటే నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం హాస్పిటల్ లో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని జనసేన నాయకులతో కలిసి ఇంఛార్జి అళహరి సుధాకర్ తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ కావలిలో రౌడీఇజం, గూండాఇజం, దోర్జన్యం, దోపిడీ, హత్యలు, మానభఒగాలు, గంజాయి, కబ్జాలకు అడ్డాగా మారిందని, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ మధ్యే రౌడీఇజంను ఉక్కు పాదాలతో అణచివేస్తాను అని ప్రగల్భాలు పలికి కనీసం నెలరోజులు కాకముందే ముసునూరులో కోడి కత్తితో దాడి చేసినది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తే కావడము గమనార్హం. జనసేన పార్టీ తరుపున బాధితులకు న్యాయము జరిగే దాకా పోరాడుతామని ఈ విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకు వెళ్ళడం జరిగింది. ఇంకా ఒకరు నగిసెట్టి శ్రీను పరిస్థితి విషమంగా ఉండటము బాధ కలిగించింది. వీరు త్వరగా కోలుకోవాలని మనఃపూర్తీగా ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. ఈ ఇందులో కావలి టౌన్ అధ్యక్షుడు పోబ్బా సాయి, కావలి రూరల్ అధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య, కో ఆర్డినేటర్ తిరుమలశెట్టి సుధీర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాథ్, బెల్లంకొండ మస్తాన్, కృష్ణయ్య, శరణ్, మంగళగిరి శ్రీను, ప్రవీణ్, నవీన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.