ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్న కావలి జనసేన పార్టీ

కావలి నియోజకవర్గం: జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల సంక్షములో కావలి నియోజకవర్గ ఇంచార్జీ అళహరి సుధాకర్ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలాపించి ఘనంగా గణతంత్ర దినోత్సవము జరుకోన్నారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల పైగా, బ్రిటిష్ వారి దాస్య శ్రుఒఖలాలు తెంచుకొని, స్వేచ్చా వాయువులు పీల్చుకొని, మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని ఆమొడించుకున్న రోజు అని, ప్రపంచములోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు, రాజ్యాంగ నిర్మాణములో పాలుపంచుకున్న, ముసాయిదా కమిటీ సభ్యులు అందరికీ ఇవే మా ఘన నివాళులు అని ఈ కార్యక్రమములో పాల్గొన్న కావలి పట్ట అధ్యక్షుడు పొబ్బా సాయి, ఉపాధ్యక్షుడు నాగార్జున, అధికార ప్రతినిధి మన్నేపల్లి రుషికేశ్, టౌన్ యూత్ అధ్యక్షడు అజయ్, నాయకులు మస్తాన్, ప్రవీణ్, మల్లి, శరణ్, తాశిఫ్, జానీ, జిలానీ, మురళి, మఒద శ్రీను, ఎం.శ్రీను, హరి, కొండయ్య, మాల్యాద్రి, మనోహర్, రూరల్ అధ్యక్షడు వెంకయ్య, రాజేష్, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.