గోదావరి జలాలను విడుదల చేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. కొండపోచమ్మ జలాశయంపై నిర్మించిన సంగారెడ్డి కాలువ ద్వారా వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద హల్దీ వాగులోకి గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని దాదాపు 14వేల ఎకరాలకు తక్షణం సాగునీరు అందనుంది. ఈకార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.