కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న: చంద్రబాబు

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కరోనా బారినపడడంతో ఆయన క్షేమాన్ని కోరుకుంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్-19 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

అటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ అన్న సంగతి తెలియడంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గారు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.