వనితకు అండగా ఖమ్మం జనసేన

ఖమ్మం నివాసి వనిత గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యను చూసి జనసేన పార్టీ తరఫున ఖమ్మం జనసైనికులు మైలవరపు మణికంఠ, హరి, మహేష్, భరత్ కలిసి ఆమె సమస్యను జనసేన పార్టీ గ్రూపుల్లో పెట్టి వనితకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆమెకు ఎల్లప్పుడూ ఫోన్ కి అందుబాటులో ఉంటూ.. ఏ సమస్య వచ్చినా సపోర్ట్ చేస్తున్న మణికంఠ, హరి, భరత్ లకు వనిత ధన్యవాదాలు తెలియజేస్తూ.. సహాయం చేసిన ప్రతి ఒక్కరూ.. రమేష్, కిరణ్, గుర్వయ, చంద్రమోహన్, రాజేష్, అశోక్, వెంకట సుబ్బారావు, వెంకటేష్, శివరామకృష్ణ, సతీష్, జగదీష్, రమేష్, సై కిరణ్, నాగరాజు లకు ధన్యవాదాలు తెలియజేసారు.