మదనపల్లిలో జనసేన కార్యాలయానికి విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డి
మదనపల్లి: కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారు జనసేన, టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను పరిచయం చేసి అత్యధిక మెజారిటీతో కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపుకు, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేయాలనీ నాయకులు కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ లు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర, నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు ప్రదీప్ సింగ్, తెలుగుదేశం నాయకులు తాళ్ల గిరి, రవి, పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేష్, కొలిమి ప్రసాద్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కుమార్, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాధ్, గడ్డం లక్ష్మిపతి జనసేన సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, రూరల్ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, వీరమహిళలు పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, పట్టణ రూరల్ జనరల్ సెక్రటరీ నాగవేణి, పద్మావతి, సరోజ, పట్టణ ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ, వరికోళ్ల నాగరాజు, రాజారెడ్డి, లవన్న, సెక్రటరీ మేకలచెర్వు అర్జున, రామసముద్రం ప్రధాన కార్యదర్శి క్రాంతి బంగారం, అఫ్రోజ్ ఖాన్, సెక్రటరీ జయ, గంగులప్ప, గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ మారప్ప నాయక్, శ్యామ్, మల్లికార్జున, ఇంకా అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-06-at-2.46.35-PM-1024x768.jpeg)