నో మై కాన్స్టిట్యూఎన్సీ 55వ రోజు

  • శ్రీకాళహస్తి పట్టణంలోని బి.పి. అగ్రహారం కాలనిలో శ్రీమతి వినుత కోటా పర్యటన

శ్రీకాళహస్తి: నో మై కాన్స్టిట్యూఎన్సీ 55వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం లోని బి. పి. అగ్రహారం కాలనిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు, కరెంట్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, సంక్షేమ పథకాలు కొద్ది మందికి పరిమితం చేసి, అర్హత ఉన్న పేద వారికి చాలా మందికి అందడం లేదని ప్రజలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యువతకి, పేద ప్రజలకు మంచి జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి చరమగీతం పాడాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు వినోద్ కుమార్, వెంకటరమణ యాదవ్, నితీష్ కుమార్, జనసైనికులు వెంకటేష్, చంద్ర శేఖర్ యదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.