ప్రైవేట్‌ ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై కేటీఆర్‌ ఆగ్రహం

కరోనా వైరస్‌ బాధితుల ఫై  ప్రైవేట్‌ ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ ‌మీడియాలో వచ్చిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్‌ను ట్విటర్‌లో కోరారు.

కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొనగా … ఆరు కోవిడ్ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.