కుడిపూడి శ్రీరామ్మూర్తి భార్యకు నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం మావుళ్ళమ్మ గుడి సెంటర్ హనుమాన్ జంక్షన్ లో కుడిపూడి శ్రీరామ్మూర్తి భార్య(38) గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడవడం జరిగింది. రాత్రి 10:30 సమయంలో వారి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పితాని పరామర్శించారు. వీరి వెంట సంసాని పాండురంగారావు, భీమాల సూరి నాయుడు, విళ్ళ శివ, దూడల స్వామి, పితాని రాజు, కడలి కొండ, గుత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.