టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో చంద్రన్న షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ

రంపచోడవరం నియోజకవర్గం: అడ్డతీగల మండలం, బొడ్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి వంతల రాజేశ్వరి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు జర్తా వెంకట రమణారెడ్డి, జనసేన పార్టీ కుప్పల జయరాం ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీ.డి.పి సీనియర్ నాయకులు జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి, జనసేన సీనియర్ నాయకులు పొడుగు సాయి, టీ.డి.పి నాయకులు మండల ఉపాధ్యక్షులు మేడిశెట్టి శ్రీను, కొమరం ధర్మన్న దొర, చదల రామకృష్ణ రెడ్డి, కూరసం నాగమణి, గణిరెడ్డి భాస్కరావు చింతోజీ సోమరాజు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల మణికంఠ, ముత్యాల చిన్నరెడ్డి, చంద్రావు తదితరులు పాల్గొన్నారు.