మహాత్మునికి నివాళులర్పించిన కుప్పం జనసేన

కుప్పం: జాతిపిత మహాత్మ గాంధీజీ జయంతి సందర్భంగా సోమవారం కుప్పంలో జనసేన నాయకులు మహాత్మునికి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి వారు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్ధతు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శి మునెప్ప, మండల అధ్యక్షులు కిశోర్, మండల కార్యవర్గ సభ్యులు హంసగిరి, రవితేజ, మంజునాథ్, సౌందర్ రాజ్, నవీన్, మూర్తి, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.