ఎల్బీనగర్ నియోజకవర్గ జనసేన విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ ఎన్నికల కసరత్తులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యనిర్వాహక సభ్యులు పొన్నూరి శిరీష ఆధ్వర్యంలో మరియు సందీప్, చైతన్య, హనుమంతరావు, బ్రహ్మాజీ, శ్యామ్, కృష్ణారెడ్డి, బద్రి, సాయి ప్రసాద్, సురేందర్, శ్రీను, గౌతమ్, శివ, లింగంకీర్తిల పర్యవేక్షణలో జనసేన శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పర్యవేక్షణ బృందం సభ్యులు రాధారం రాజలింగం, మేకల సతీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రత్న పిల్లా, లిఖిత పాల్గొని రాబోయే ఎన్నికల కొరకు జన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.