యార్లగడ్డ వారి గూడెంలో రైతులను పరామర్శించిన జనసేన-టీడీపీ పార్టీల నేతలు

పెనమలూరు నియోజకవర్గం, మిచౌంగ్ తుఫాన్ ముంపు ప్రాంతాలను జనసేన పార్టీ కంకిపాడు మండల ప్రధాన కార్యదర్శి చొక్కా రాజా, కార్యదర్శి రంజిత్, నేతృత్వంలో ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ యార్లగడ్డ వారి గూడెంలో పంట నష్ట పోయిన రైతులను జనసేన-టీడీపీ పార్టీల నేతలు కలిసి పరామర్శించి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చే విధంగా అధికార పార్టీపై ఓత్తిడి తీసుకొస్తామని స్థానిక రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి బొడే ప్రసాద్, పెనమలూరు మండల జనసేన అధ్యక్షులు కరిమికొండ సురేష్, తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షులు తాతపుడి గణేష్, టీడీపీ శ్రేణులు, జనసైనికులు అందరూ పాల్గొని ప్రభుత్వం తుఫాన్ బాధితులను ఆదుకోవాలి తగిన నష్ట పరిహారం త్వరగా చెల్లించాలి అని నినాదాలు చేశారు.