ఒంటి చేతితో రాజ్యాంగాన్ని రాసిన ఒకే ఒక్కరు అంబేద్కర్

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయంలో పార్టి గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయులు పంపిణి చేసారు, అనంతరం వంశీ కృష్ణ మాట్లాడుతూ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి భారత రాజ్యాంగాన్ని రాసే కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండగా, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో అందుబాటులో లేకపోవడంతో ఒంటి చేతితో రాజ్యాంగాన్ని రాసిన ఒకేఒక్కరు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ నాయకులు మెరుగు శివకోటి యాదవ్, గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షులు గడ్డం రాకేష్, ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, కార్యదర్శులు శేషాద్రి సందీప్, మహమ్మద్ ఇబ్రహీం, తోట రాజు, యువజన విభాగం ఆర్గనైసింగ్ సెక్రటరీ కమిద్రి అన్వేష్, కార్యదర్శి ల్యాదేల్లా రాకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వస్కులా నిఖిల్ చోప్రా, జిల్లా నాయకులు గోపు నవీన్, అనిల్, శేఖర్, రోహన్, వంశీ, సంతోష్, రాజేష్, కుమార్ మరియు వీరామహిళలు పాల్గొన్నారు.