యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన ఉత్తరాంధ్ర జనసేన నాయకులు

జనవరి 12న జనసేన పార్టీ, నిరుద్యోగ యువకుల సమస్యపై ఉత్తరాంధ్ర సిక్కోలు వేదికగా రణస్థలంలో “యువశక్తి” భారీ బహిరంగ సభగా జనసేనాని తన గళం వినిపించనున్నారు. జరిగే వేదిక వద్ద బుధవారం యువశక్తి కమిటీ సభ్యులు, ఉత్తరాంధ్ర ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు కలిసి మీడియా ప్రతినిధుల వద్ద యువశక్తి పోస్టర్లు (గోడ పత్రికలు, కర పత్రికలు) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.