పూలే ఆశయాలు సాధిద్దాం – విస్సన్నపేట మండల జనసేన

విసన్నపేట, మహాత్మా జ్యోతి రావు పూలే 133 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన విస్సన్నపేట మండల జనసైనికులు మంగళవారం విసన్నపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ యాసిన్ మరియు మండల కార్యవర్గ సభ్యులు విస్సన్నపేటలోని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే శిలా విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాసిన్ మాట్లాడుతూ ప్రముఖ సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, కులవివక్షకు వ్యతిరేకంగా నాలుగు దశాబ్ధాలపాటు సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సామాజిక ఉద్యమం నడిపిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నామని ఆయన ఆశయాలను అమలు చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో పయనిస్తూ పూలే ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు అందరం పనిచేస్తామని ఈ సందర్భంగా యాసిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కస్తూరి సీతారామస్వామి, తోట కిషోర్, చింతల తేజ, పండు, మర్రిబోయన మహేష్, పసుపులేటి సతీష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.